జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించిన అనంతపురం జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్

    ఉరవకొండ, (జనస్వరం) : అనంతపురం జిల్లా జనసేనపార్టీ కార్యదర్శి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గములో ప్రతి జనసేన కార్యకర్త పార్టీ సభ్యత్వం చేసుకొని అదే విధంగా పోయినసారి సభ్యత్వం తీసుకుని ఉంటే ఇప్పుడు దాన్ని రెన్యువల్ చేసుకుని ప్రతి జనసేన కార్యకర్తకు ఈ సమాచారం తెలిపి జనసేన పార్టీ సభ్యత్వం చేసుకునే విధంగా ప్రోత్సహించవలసినగా కోరుతున్నాము. జనసేన పార్టీ కార్యకర్తలకు వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన 5 లక్షల రూపాయల జీవిత భీమా సౌకర్యం, 50,000 రూపాయల ప్రమాద భీమా సౌకర్యం కల్పించడం జరిగింది. ఏది అయినా ప్రమాదంలో మరణించినట్లైతే 5లక్షలు పార్టీ తరుపున ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి జనసేన కార్యకర్త సభ్యత్వంలో భాగస్వాములై సభ్యత్వం ( Or ) రెన్యువల్ చేసుకుని మిగిలిన కార్యకర్తలకు సభ్యత్వం & రెన్యువల్ చేయించవలసిందిగా కోరుచున్నాము. ఉరవకొండ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇతర పట్టణాల్లో ఉన్నవారు కూడా సభ్యత్వ నమోదు చేయించుకోవలసినగా కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షులు చంద్రశేఖర్, గోపాల్, కేశవు, నగేష్ ఉపాధ్యక్షలు రాజేష్, అబ్దుల్ కమిటీ సభ్యులు తిలక్, మల్లి, మల్లేష్, సూర్యనాయక్, జొన్న సోము, దేవేంద్ర, సురేష్, నవీన్, కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు.

See also  పవన్ కళ్యాణ్ గారు చెప్పిన నందిగ్రామ్ ఘటన గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి