ఒంగోలు జనసేన పార్టీలోకి మేదరమెట్ల ఎస్సీ కాలనీ నుండి చేరికలు

ఒంగోలు

          ఒంగోలు ( జనస్వరం ) : మేదరమెట్ల ఎస్సీ కాలనీ నుండి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి శైలజ, రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ రాయపాటి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.   ఈ సందర్బంగా షేక్ రియాజ్ గారు పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది అని అన్నారు. మీ ప్రాంతంలో పార్టీ యొక్క పటిష్టతకు కృషి చేయాలి అని పిలుపు ఇచ్చారు. పార్టీలో చేరిన వారి పేర్లు బుర్రి తేజ, గోగులమూడి శశికాంత్, యరమాల సునీల్, అద్దంకి వాసు, దేవరపల్లి హరీష్, రాయపూడి క్రాంతికుమార్, దాట్ల కోటేశ్వరరావు, నూకతోటి ప్రభుదాసు, ముత్తానపల్లి సురేఖ, శెట్టి అరుణ, నూకతోటి అన్నపూర్ణ తదితరులు ఉన్నారు.

See also  అనాధ పిల్లలకు 90 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన జనసైనికులు