మున్సిపల్‌ ఎన్నికలకు జనసేనపార్టీ సిద్ధం – రాజంపేట జనసేన నాయకులు చెంగారి శివప్రసాద్‌

    రాజంపేట, (జనస్వరం) : రాజంపేట మున్సిపల్‌ ఎన్నికల బరిలో తలపడేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని, ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించి తీరుతామని రాజంపేట జనసేన నాయకుడు చెంగారి శివప్రసాద్‌ పేర్కొన్నారు. రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే మున్సిపల్‌ ఎన్నికలపై ఇప్పటికే పార్టీ నాయకులతో, కార్యకర్తలతో చర్చించినట్లు తెలిపారు. అన్ని వార్డుల్లో జనసేన పోటీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్‌ సెల్‌ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు, పిలుకూరి శంకర్‌, తొందరపు రాజేష్‌, అతీఫ్‌, భాను తేజ తదితరులు పాల్గొన్నారు.

See also  వైసీపీ చెబుతున్న సమగ్ర భూ సర్వే దేని కోసం