అనాధ పిల్లలకు 90 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన జనసైనికులు

అనాధ పిల్లలకు 90 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన జనసైనికులు

      తెలంగాణలోని నల్గొండ జిల్లా ముకుందాపురం గ్రామానికి చెందిన మీసాల పరుశురాములు, అనిత దంపతులు అకాల మరణం చెందడంతో వారి కుమార్తెలు నవ్య, దివ్య, సదా లు అనాధలు అయ్యారు. వారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ మేకల సతీష్ రెడ్డి 90 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద బిడ్డలు చిన్న వయసులో తల్లితండ్రులను కోల్పోవడం బాధాకరం అని అన్నారు. భవిష్యత్తులో విద్యాపరమైన సహాయ సహాకారాలు అందిస్తామని అన్నారు. వేల కోట్ల ఆస్తిపరులు, ప్రజా ప్రతినిధులు ఈ అనాధ బిడ్డలకుఆర్థిక సహాయం చేసి, మేమున్నామని భరోసా కల్పించి ఆదుకోవాలని అన్నారు. ముగ్గురు ఆడబిడ్డలు అనాధలు కావడం నా మనస్సు చలించింది అన్నారు. వీరి దాన హృదయానికి గ్రామస్తులు పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు ఆలువాల పవన్, మీసాల మహేశ్, అందె శ్రీను, పూర్ణ నాగార్జున్, చంద్ర కాంత్, వరుణ్, జితేందర్ గోపీనాధ్, శ్రీకాంత్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు. 

See also  ఒమిక్రాన్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి : జనసేన మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి