శ్రీరామనవమి సందర్భంగా అనంతలో భారీ బైక్ ర్యాలీ

అనంతపురం, మార్చి 17, (జనస్వరం) : శ్రీరామనవమి సందర్భంగా అనంతపురం నగరంలోని హరిహర టెంపుల్ నుండి బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. సురేష్, కేశవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ హరిహర టెంపుల్ నుంచి ప్రారంభమై మెడికల్ కాలేజ్, ఐటీఐ, మీట్, సప్తగిరి సర్కిల్, ఓల్డ్ టౌన్, బంగారపు వీధి మార్గంగా సాగి చివరగా జూనియర్ కాలేజీలో జరుగుతున్న శ్రీరామ రథోత్సవంలో కలిసింది. ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హరిహర టెంపుల్ అధ్యక్షుడు రవి, అరవింద్ నగర్ ఆర్ఎస్ఎస్ ఇంచార్జ్ నాగేంద్ర యాదవ్, హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. మరక నాగేంద్ర మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల భారతీయ కుటుంబ వ్యవస్థకు ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో శ్రీరామ ఆలయ నిర్మాణం ద్వారా సనాతన ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారని కొనియాడారు. యువత సనాతన ధర్మం వైపు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సనాతన ధర్మాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ మహిళలు, యువత వందలాది సంఖ్యలో పాల్గొన్నారు.

See also  సుదీర్ఘ కాలంగా ఉన్న పావురాల గుట్ట ఇళ్ల పట్టల సమస్యను పరిష్కరిస్తాం