అరవ జయపాల్ కు ఉగాది సత్కారం

తిరుపతి, మార్చి 18, జనస్వరం : శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల సందర్భంగా ప్రజా కళావేదిక చైర్మన్, సీనియర్ జర్నలిస్ట్ అరవ జయపాల్ కు బుధవారం నెల్లూరులో ఘన సత్కారం జరిగింది. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ అధ్యక్షతన ద్విశతాధిక జాతీయ కవిసమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్వేపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరై మాట్లాడారు. అనంతరం జరిగిన కవిసమ్మేళనంలో అరవ జయపాల్ చేసిన స్వీయ కవితాగానం ఎంతగానో అలరించింది. ఈ సందర్భంగా జయపాల్ ను ఘనంగా సత్కరించారు. తొలుత అందరికీ షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని అందజేశారు. వెంకటాచలంలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయభవన్ ప్రాంగణం కవుల సందడితో కిటకిటలాడింది. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం పరిశోధకులు డా. నూనావత్ రాంబాబు, డా. కొల్లేటి రవిబాబు, డా. సోమరాజుపల్లి మమత, డా. టి.ఎస్. వెంకటేష్, డా. బడిగె ఉమేష్, డా. పోచంబావి గోపికృష్ణ, డా. ఈతకోట ఈశ్వరరావు, డా. పి. నరసింహం, డా. కె. గౌరీశ్వరరావు, డా. పి. లోకేశ్వరి, డా. ఆర్. బాలసుబ్రమణ్యం, డా. కనియంపాటి రామకృష్ణ, డా. సుభాషిణి, డా. గాయత్రీదేవి తదితరులు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

See also  దత్తపుత్రుడు ప్యాకేజీ అంటే పాదరక్షకులు విరిగిపోతాయి జగన్ రెడ్డి