చిత్తూరులో అమరవీరులకు జనసేన, బీజేపీ నాయకుల ఘన నివాళులు

చిత్తూరులో అమరవీరులకు జనసేన, బీజేపీ నాయకుల ఘన నివాళులు

                జనసేనపార్టీ చిత్తూరు నాయకులు పుంగనూరు నానబాల లోకేష్ రాయ్, అనిల్ కుమార్, బీజేపీ నేతలు జయకుమార్, పోతపాల రామమూర్తి, తోటపాళ్యం వెంకటేష్, సిద్ధా, మనం ఫౌండేషన్ వర్ష తదితరులు పాల్గొని అమరజవాన్ల వీరమరణం పట్ల మౌనం పాటించి, తర్వాత వారి ప్రాణత్యాగం గురించి కొనియాడారు. ఉగ్రమూకలను ఎదురొడ్డి అశువులు బాసిన ప్రవీణ్ కుమార్ రెడ్డి మహేష్, అశుతోష్ అమరహే అంటూ నినాదాలు చేస్తూ ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

See also  భౌతిక దాడులకు బీజేపీ భయపడదు : బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి