
శృంగవరపుకోట ( జనస్వరం ) : నియోజకవర్గం కొత్తవలస మండల అధ్యక్షులు నక్కరాజ్ సతీష్ ప్రమాదవశత్తు మరణించిన విషయం తెలిసిందే. వారి కుటుంబ సభ్యులకు భరోసా నింపడం కోసం ఉమ్మడి విజయనగరం జిల్లా మండల అధ్యక్షులు అందరూ కూడా వారి కుటుంబాన్ని పరామర్శించి వాళ్లలో ధైర్యం నింపారు. పార్టీ ఎప్పుడూ కూడా మీ కుటుంబానికి అండగా నిలబడుతుందని చెప్పి వారి కుటుంబానికి 30000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.








