రోడ్లు వేయాలని కలెక్టర్ కు వినతి పత్రం

రోడ్లు

   శ్రీకాకుళం ( జనస్వరం ) : బూర్జ పంచాయతీ, మజ్జివలస గ్రామ ప్రధాన రహదారి మట్టి రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నది. దీనిపై పలుమార్లు తారు రోడ్డు సేంక్షన్ చేయమని అధికారులకు వినతిపత్రం అందదేసిన జనసేన నాయకులు. ఇప్పటి వరకు ఎటువంటి పనులు మొదలు పెట్టడం లేదని వారు వాపోతున్నారు. అలాగే మజ్జివలస నుండి కొండయి పాడు వరకు ఆరు కిలోమీటర్లు, బూర్జ నుంచి తుంబాయి పాడు వరకు మూడు కిలోమీటర్ల రోడ్డు వేయమని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి ఆర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బూర్జ పంచాయతీ జనసేన పార్టీ వైస్ సర్పంచ్ పరశురాం, రాప బుద్దు జనసేన పార్టీ మండల నాయకులు, బూర్జ సర్పంచ్ బొంజుబాబు, అప్పన్న గారు ఆర్జీలు కలెక్టర్ గారికి సమర్పించారు.

See also  కదిరి టౌన్ 34వ వార్డులో జనసేనపార్టీ కమిటీ ఎంపిక