జాతిపిత మహాత్మా గాంధీజీ కి నివాళులు అర్పించిన జనసేన పార్టీ

జాతిపిత

       మైలవరం ( జనస్వరం ) : మైలవరం నియోజకవర్గం, కొండపల్లి మున్సిపాలిటీలో జాతిపిత మహాత్మాగాంధీ 75వ వర్ధంతి సందర్భంగా మార్కెట్ సెంటర్ నందు మరియు ఆర్యవైశ్య కళ్యాణమండపం రోడ్డులో గల గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇంచార్జి మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహనరావు ( గాంధీ). ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యాగ్రహం, అహింస, సహాయ నిరాకరణ, శాంతియుత పోరాటాలతో మాత్రమే బ్రిటిష్ వారిపై విజయం సాధించారని, అహింస మార్గంలో మాత్రమే మనం మన హక్కులను సాధించగలం అని మరియు ఆయన జాతిపితగా ఎదిగిన వైనం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యర్రంశెట్టి నాని, సామల సుజాత, రామాంజనేయులు, రాగాల నాని, దూడల ఈశ్వర్, నాగభూషణం, బొమ్మల రమేష్, చరణ్, సిరిపురం సురేష్, , శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు..

See also  వీరఘట్టం మండల కేంద్రములోని రోడ్లు విస్తరణ పనులను పరిశీలించిన జనసైనికులు