విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నది రోగులకా? లేకపోతే రేపిస్టులకా? చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత

    చిత్తూరు, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్  పాలనలో మహిళలకు రక్షణ లేదు. మహిళలపై అత్యాచారాలు చేసే మృగాలకి రక్షణ ఎక్కువగా ఉందని అనిత ప్రభుత్వం పై మండిపడ్డారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మతిస్థిమితం లేని మహిళపై 30 గంటల పాటు ముగ్గురు యువకులు మానభంగం చేయడం చాలా దురదృష్టకరమని  అన్నారు. ముఖ్యమంత్రి డబ్బకొట్టుకునే దిశ చట్టం ఆంధ్రలో ఎక్కడ ఉందని మండిపడ్డారు. 3 రోజుల ముందే పోలీసులుకు పిర్యాదు చేసినా సరైన స్పందన లేదని వాపోయారు. హోం మంత్రి బాదితురాలిని, ఆమె తల్లి తండ్రులను పరామర్శించి సహాయం అందించడం కాదు! ఇలాంటి సంఘటనలు జరగకుండా బలమైన చట్టాలు తెచ్చి వాటిని అమలు చేయటం చేయాలని అన్నారు. దిశ చట్టం ఆంధ్రలో ఎక్కడ పని చేస్తోంది.. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుందో సమాదానం చెప్పాలని జనసేనపార్టీ తరుపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

See also  రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అభిమానుల ఆత్మీయ సమావేశం