రైతులకు అండగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం

పవన్ కళ్యాణ్

           తూర్పుగోదావరి ( జనస్వరం ) : రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో జనసేన అధ్యక్షులు శ్రీ కొనేదల పవన్ కళ్యాణ్ గారి చిత్ర పటానికి కౌలు రైతులు పాలభిషేకం చేసారు. జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి దాలిపర్తి శ్రీనివాసు మాట్లాడుతూ దేశంలో సొంత డబ్బు రైతులకోసం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు పవన్ మాత్రమే అని రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించడం పై ఆనందం వ్యక్తం చేశారు. జనసేన అధ్యక్ష్యులు పవణ్ కళ్యాణ్ గారి విశాల హృదయంతో 5కోట్ల రూపాయలు ప్రకటించడం హర్షించదగ్గ విషయం అని, ఒక కష్టించే వ్యక్తి యొక్క కష్టం విలువ కష్టించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికే తెలుసని అన్నారు. ఏ అధికారం లేకపోయినా ఇప్పుడే రైతులు పట్ల ఆయన అభిమానం చూపుతున్నారని రైతులపట్ల ఇంత ప్రేమ ఏ ఇతర పార్టీ నాయకుల్లో చూడలేదని, రాబోయే రోజుల్లో ఆయన అధికారంలోకి వస్తే ” రైతే రాజు ” అనే పదానికి సరైన నిర్వచనం వస్తుందని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఎంపీటీసీ -1 గొల్లపల్లి అనురాధ, 1వ వార్డ్ సభ్యులు గళ్ళా సావిత్రి , జనసేన నాయకులు, జనసైనికులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

See also  పారిశుధ్యంపై నిర్లక్ష్యం తగదు : ఎమ్మిగనూరు జనసేన నాయకులు గానిగ బాషా