చనిపోయిన జనసేనపార్టీ క్రియాశీల కార్యకర్త కుటుంబానికి 50,000 ఆర్థిక సాయం

 శ్రీకాళహస్తి ( జనస్వరం ) : శ్రీకాళహస్తి మండలం మాధవమాల గ్రామంకి చెందిన జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త తిప్పరాల నవీన్ (21) ఇటీవల గుండెపోటు అనారోగ్యంతో మరణించడం జరిగింది.  జనసేనపార్టీ ఇంఛార్జి  వినుత కోటా గారు నవీన్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున నాయకులు, జనసైనికుల సహకారంతో 50,000 ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఏ కష్టమొచ్చినా సొంత కుటుంబ సభ్యులుగా భావించి అండగా ఉంటామని నవీన్ అమ్మ గారికి బరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, పట్టణ ఉపాధ్యక్షుడు తోట గణేష్, ఐటీ కోఆర్డినేటర్ కావాలి శివకుమార్, ప్రధాన కార్యదర్శులు ముడుసు గణేష్, పేట చిరంజీవి, నితీష్ కుమార్, పేట చంద్ర శేఖర్, నాయకులు వెంకట రమణ యాదవ్, రాజేష్, సురేష్, చైతన్య, తులసీరాం, చందు యాదవ్, గోపి తదితరులు పాల్గొన్నారు. 

See also  నిడమర్రు మండలం జనసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు