
ధర్మవరం, (జనస్వరం) : తాడిమర్రి మండలం ఆత్మకూరు గ్రామంలోని టిడిపికి చెందిన 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి గారి నివాసంలో జరిగిన కార్యక్రమంలో వారిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిలకం మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన పార్టీకి పెరుగుతున్న ప్రతిష్టకు మెచ్చి పెద్దఎత్తున తమ పార్టీలో చేరేందుకు సన్నద్దులవుతున్నట్లు తెలిపారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నిర్వహణ, ప్రజా సమస్యలపై స్పందిస్తున్న తీరు, పథకాల అమలులోని ప్రశ్నిస్తున్న విధానాలకు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందని ఆయన తెలిపారు. పార్టీ ప్రతిష్టకు, పార్టీ బలోపేతానికి పాటు పడాలని ఆయన పార్టీలో చేరిన వారిని కోరారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన వీరాంజనేయులు, రాఘవ, రమేష్, రామాంజనేయులు, గంగాధర్లు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్కళ్యాణ్ తీసుకుంటున్న విధివిధానాలకు మెచ్చి జనసేన పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. జయరామంజనేయులు, సాంభ, ప్రకాష్రెడ్డిల ఆధ్వర్యంలో పార్టీలో చేరినవారిలో సూర్యనారాయణ, హరి, అరుణ్, తరుణ్, శివయ్య, హరికిరణ్, కార్తీక్, అదెప్ప, యుగంధర్, సలీం, రాజ సుధాకర్, బాబులతో పాటు పలువురు ఉన్నారు.








