ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకపోయిన యువకుడి కుటుంబానికి రూ. 35 వేల సాయం అందించిన ఆళ్లగడ్డ జనసైనికులు

ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకపోయిన యువకుడి కుటుంబానికి రూ. 35 వేల సాయం అందించిన ఆళ్లగడ్డ జనసైనికులు                        

      కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గం సిరివెళ్ల మండలం కాదరాబాదరా గ్రామం మధ్యలో బండ్లవాగు కాల్వ దాటుతూ కదరాబాదరా గ్రామానికి చెందిన బండారు నడిపి చెన్నయ్య ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయినాడు. మరణించిన మృతుని కుటుంబానికి సాయంగ 35000. రూపాయలు ఆళ్ళగడ్డ జనసేన పార్టీ నాయకుడు మైలేరి మల్లయ్య మరియు సిరివెళ్ల మండల నాయకుడు పసుల నరేంద్ర యాదవ్ జమాల్ బాష ఆధ్వర్యంలో నగదును అందించడం జరిగింది. బాధిత కుటుంబానికి జనసైనికులు, జర్నలిస్ట్ సోదరులు మరియు కాపు యువత ఆర్థిక సాయం చేసారు. మైలేరి మల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వం తరుపున కూడా ఆ కుటుంబాన్ని ఆర్థికంగ ఆదుకోవాలని అలాగే నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఉన్నటువంటి బ్రిడ్జిల వచ్చే వర్షాకాలంలోపు నిర్మించాలని, నిర్మించలేపోతే జనసేన పార్టీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు అధికార పార్టీ నవరత్నాలతో ప్రజల కష్టాలు తీరవని, దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్నటువంటి ప్రజా సమస్యలను పరిస్కార దిశగా ప్రభుత్వం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామచంద్రుడు, రమేష్ యాదవ్, వంశీ, కర్ణ, వెంకటసుబ్బయ్య, రాజారామ్ మహబూబ్ బాష, రవి, లక్ష్మి నరసయ్య, రవి, హరి, తదితరులు పాల్గొన్నారు. 

See also  హరి రామ జోగయ్య అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం : పోతిన మహేష్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి