
గోరంట్ల, (జనస్వరం) : గోరంట్ల మండలం నార్సింపల్లి గ్రామ పంచాయతీ ఎర్రబల్లి గ్రామం నుంచి ఇతర పార్టీల నుండి 20 కుటుంబాలు జనసేన పార్టీ లోకి చేరడం జరిగింది. గోరంట్ల మండల నాయకులు సురేష్ సంతోష్ వెంకటేశ్ ఆధ్వర్యంలో ఎర్రబల్లికి చెందిన నారాయణ, గంగాద్రి, గిరి, అంజి, రాజు, నవీన్ , గణేష్, వెంకటేష్, అశోక్ తదితరులు జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి, ప్రజలకోసం నిరంతరం ఎక్కడ సమస్య జరిగిన వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. రానున్న 2024 లో జనసేన తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.








