తాడిపత్రి జనసైనికుడు ఇమాంవలి ఆధ్వర్యంలో యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ

తాడిపత్రి

           తాడిపత్రి ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈనెల 12వ తేదీన నిర్వహిస్తున్న యువశక్తి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాడిపత్రి జనసైనికుల ఆధ్వర్య౦లో గోడపత్రికలను విడుదల చేయడం జరిగింది. జనసైనికులు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఉమ్మడి నిరుద్యోగ సమస్య ఎక్కువ అయిందని, తద్వారా యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి, ఇపుడు యువతను నాశనం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు కార్యక్రమాల నిర్వహణ కమిటీ మెంబర్ అల్తాఫ్, రబ్బాని JSP, అఖిల్ కుమార్, సాదక్ వలి, బాబావలి, షాషా, గైబు సాబ్, మరియు చిరంజీవి యువత పట్టణ అధ్యక్షుడు ఆటో ప్రసాద్, జాఫర్ సాదిక్, దేవర అంజి, రవి కిషోర్ తదితరులు పాల్గొనడం జరిగింది.

See also  గోడ పత్రికను ఆవిష్కరించిన జనసేన నాయకులు గెడ్డం చైతన్య

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి