సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాటం చేస్తాం – జనసేన నాయకురాలు సయ్యద్ కాంతి శ్రీ

సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాటం చేస్తాం – జనసేన నాయకురాలు శ్రీ కాంతి శ్రీ

               శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గలో లావేరు మండలంలో గుడిదాం పంచాయతీ వేణుగోపాలపురం “మనఊరు-మనసేన” 2వ కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయడం మరియు క్రియా శీలక సభ్యత్వం, పార్టీ సిద్ధాంతాల గురించి వివరించడం జరిగింది.  గ్రామ ప్రజలు మాట్లాడుతూ అనేక సమస్యలుతో ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు. ముఖ్యంగా కొన్ని సంత్సరాలుగా రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని తెలియజేశారు. జనసేన వీర మహిళ శ్రీ కాంతి శ్రీ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరికి ఏం సమస్య వచ్చినా ముందుగా అండగా ఉండేది జనసేన పార్టీ అన్నారు. జనసేన పార్టీ ఓడిపోయినా ప్రజల సమస్యలను తీర్చడానికి అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు క్రాంతి శ్రీ గారు Dr.విశ్వక్సేన్ గారు మోహన్, తవిటీనాయుడు, గణేష్ రాజు, రాజా రమేష్, కాకర్ల.బాబాజీ, దుర్గాప్రసాద్, అప్పలకొండ, సూర్య, గౌతమ్, జయప్రకాశ్, నిఖిల్, తిరు, మనోజ్ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  ఆర్టీసీ కాంప్లెక్స్ సమస్యలపై కలెక్టరుకు వినతిపత్రం