మత్స్యపురిలో వైసీపీ దాడిని ఖండిస్తున్నాం : రైల్వే కోడూరు జనసేన నాయకులు

         భీమవరం నియోజకవర్గ పరిధిలోని మత్స్యపురి గ్రామ మహిళా దళిత సర్పంచి మరియు వార్డ్ నెంబర్ లపై వైకాపా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గారి దాడి ఘటన రైల్వే కోడూర్ జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నా మని జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు పేర్కొన్నారు.. ఈ దాడి ఘటనకు కారణమైన వైకాపా పార్టీనేతలను, గూండాలను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని కోరారు… ప్రజాస్వామ్యంలో దాడులు ప్రతి దాడులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ విభాగం అధిపతిని కోరారు… పంచాయతీ ఎన్నికలను స్థానికంగా సామరస్య పూర్వకంగా ప్రజలలో ఎవరికి మంచి పేరు ఉంటే వాళ్లకి ప్రజలు పట్టం కడతారు అన్నారు ఇలాంటి ఘటనలపై స్పందిస్తూ జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేయబడుతుంది అని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో ఎదల అనంత కాయలు, ఉయ్యాల మధులత, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

See also  పొన్నాడ గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమం