జనసేన నాయకుడు చిలకం మధు హౌస్ అరెస్టు ను ఖండిస్తున్నాం : కదిరి ఇంచార్జ్ భైరవ ప్రసాద్

జనసేన నాయకుడు చిలకం మధు హౌస్ అరెస్టు ను ఖండిస్తున్నాం : కదిరి ఇంచార్జ్ భైరవ ప్రసాద్

                      ధర్మవరం  నియోజకవర్గం తాడిమర్రి మండలం మర్రిమేకులపల్లి లో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామంలో నష్టపరిహారం చెల్లించకుండానే అధికారులు ఇళ్లను కూల్చివేయడం దారుణం. అంతేకాకుండ ఇళ్లల్లో మనుషులు ఉండాగానే జేసీబీలతో ఇళ్లను కూల్చుతూ రౌడీ, ఫ్యాక్షన్ పాలనను పునరావృతం చేస్తుంది ఈ వైసిపి ప్రభుత్వం. ఈ ఘటనలో మూడు సంవత్సరం కల చిన్నారి తీవ్ర గాయాల పాలు అయ్యారు. ఆ గ్రామ ప్రజలకు మరియు తీవ్ర గాయాలు ఐన చిన్నారి కుటుంబానికి అండగ నిలబడటానికి వెళతున్న ధర్మవరం జనసేన పార్టీ ఇంచార్జ్, PAC సభ్యులు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారిని పొలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ అక్రమ హౌస్ అరెస్టుని తీవ్రంగ ఖండిస్తున్నాము.  కనీసం పరామర్శించడానికి కూడ వెళ్లనివ్వకుండా పోలీసులు చేస్తున్నారంటే ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం ఎంత ఖూనీ చేస్తోందో అర్థమవుతోంది. మర్రి మేకులపల్లి గ్రామ ప్రజలకు జనసేన పార్టీ అండగా ఉండి న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తుందని అలాగే చిలకం మధుసూదన్ రెడ్డి గారిని వెంటనే తీవ్రంగా నష్టపోయిన గ్రామాన్ని సందర్శించడానికి అనుమతి ఇవ్వాలి లేనియెడల జనసేన పార్టీ తరఫున రోడ్డు ఎక్కి ఆందోళనలు చేయవలసి వస్తుందని జనసేన పార్టీ కదిరి నియోజకవర్గ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ డిమాండ్ చేశారు. 

See also  మడకశిర నియోజకవర్గ ప్రజలందరికీ సుదీర్ఘ వాతావరణంలో మెలగాలి : జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి