రైతు మద్దతు ధరపై డిఆర్వో, కలెక్టరు గారిని కలసిన వినతి జనసేన, బీజేపీ నాయకులు 

రైతు మద్దతు ధరపై డిఆర్వో, కలెక్టరు గారిని కలసిన వినతి జనసేన, బీజేపీ నాయకులు 

        ప్రభుత్వం ధాన్యం కు మద్దతు ధర తెలిపినప్పటికీ ఒక్క గింజ కూడా కొనుగోలు చేయని పరిస్థితి, నెల్లూరు జిల్లాలో రెండో కారు పంట చేతికి వచ్చిన సందర్భంలో దళారులు తక్కువ రేటుకి ధాన్యం అడుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మద్దతు ధర తెలిపినప్పటికీ రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు జరగలేదు. వెంటనే ధాన్యం కొనుగోలు జరిపి అన్నదాతను ఆదుకోండి అని అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి వున్నా కూడా కొనుగోలు చేయాలని జనసేన, బీజేపీ నాయకులు కోరారు. కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడం వలన నేడు బీజేపీ, జనసేన నాయకులు సంయుక్తంగా కలిసి వీఆర్వో గారికి అభ్యర్థన పత్రం అందజేసి వివరించారు. అన్నదాతలకు అన్యాయం జరగకుండా జనసేన మరియు బీజేపీ కలిసి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో, జనసేన జిల్లా నాయకులు కిషోర్ గునుకుల, శశాంక్, చిత్తూరు బాలాజీ, కోట బాలాజీ, బిజెపి నాయకులు సురేష్ రెడ్డి, ఇండ్ల రాఘవయ్య, ఆంజనేయ రెడ్డి, రామకృష్ణ గారు, మురళి తదితరులు పాల్గొన్నారు.

See also  నెల్లూరులో మన ఊరు మన ఆట కార్యక్రమం