బడ్డుకొండపేటలో గ్రామ గ్రామాన జనసేన కార్యక్రమం నిర్వహించిన విజయనగరం జనసేన నాయకులు

జనసేన

    విజయనగరం, (జనస్వరం) : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం ఇంఛార్జ్ శ్రీమతి పాలవలస యశస్వి గారు తలపెట్టిన గ్రామ గ్రామాన జనసేన కార్యక్రమాన్ని విజయనగరం నియోజవర్గంలో బడ్డుకొండపేట గ్రామంలో ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే బడ్డుకొండ పేట గ్రామంలో జనసేన నాయకులు బోబ్బాది చంద్ర నాయుడు ఇంటింటికి జనసేన సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంచిపెట్టి, గ్రామ గ్రామాన కార్యక్రమంలో భాగంగా ప్రజావేదికను నిర్వహించారు. ప్రజాసమస్యలను తెలుసుకుంటూ, అర్హులైన కొందరికి ప్రభుత్వ పథకాలు అందని వారినుంచి వినతులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు), ఎర్నాగుల చక్రవర్తి, దాసరి యోగేష్, కిలారి ప్రసాద్, అనిల్, రవీంద్ర, దినేష్, రాంబాబు తదితురులు పాల్గొన్నారు.

See also  రాష్ట్ర భవిష్యత్తు, యువతకు భరోసాకు జనసేనపార్టీని ఆదరించాలి : కోన తాతారావు