జనసేనపార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన వీరఘట్టం జనసైనికులు

     వీరఘట్టం, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గo వీరఘట్టం మండలం, బొడ్లపాడు గ్రామంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో గ్రామసేన జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమంలో భాగంగా పదవ రోజు బొడ్లపాడు గ్రామంలో జనసేనపార్టీ క్రియాశీలక సభ్యుడు అన్ను రామకృష్ణ  కుమార్తె అన్ను చరణ్య పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన జానీ, మత్స పుండరీకం, కర్ణేన సాయి పవన్ లు విద్యార్థులకు (పేడ్స్) ఫ్లాక్స్, బుక్స్, పెన్సిల్స్,  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన జానీ మాట్లాడుతూ ఇటువంటి విద్యార్థులు భవిష్యత్ బాగుండాలని, విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వం, నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి కోరారు. మీ బంగారు భవిష్యత్తు కోసం జనసేన పార్టీని పవన్ కళ్యాణ్  ప్రారంభించారని అన్నారు. అలాగే మత్స పుండరీకం మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అన్న మాటకు తగ్గట్టుగా విద్యార్థులు బాగా చదువుకోవడం, వివిధ క్రీడలు ఆడాలి, తెలియని నేర్చుకోవాలి, విద్యార్థిగా మీ బాధ్యతలు సరిగ్గా నిర్వహించాలి అప్పుడే ఉత్తమ పౌరులుగా గుర్తించబడతారు. పవన్ కళ్యాణ్ ఎంతో మంది అనాధ పిల్లలను, నిరు పేదలను అదుకుంటున్నారని తెలిపారు. కర్ణేన సాయి పవన్ మాట్లాడుతూ నేటి యువత, విద్యార్థులు పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకుని వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారికి జనసేనపార్టీ తరుపున అదుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొడ్లపాడు గ్రామ యువత, వీరమహిళలు పాల్గొన్నారు.

See also  వైసీపీ పాలనలో పేద, మధ్యతరగతి ప్రజలు చితికిపోతున్నారు : కేతంరెడ్డి వినోద్ రెడ్డి