తుమ్మూరులో 35వరోజు ఉయ్యాల ప్రవీణ్ పవనన్న ప్రజాబాట కార్యక్రమం

ఉయ్యాల ప్రవీణ్

          సూళ్లూరుపేట ( జనస్వరం ) : నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని తుమ్మూరులో 35వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉయ్యాల ప్రవీణ్ గ్రామంలోని ప్రజలకు పార్టీ సిద్దాంతాలు.. ఆశయాలు తెలియజేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే పవనన్నను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు ఉన్నారు. జనసేనపార్టీతో ఆంధ్రరాష్ర్టంలో సరికొత్త సుపరిపాలన ఇచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని‌ జనసేనపార్టీ‌ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ ఉయ్యాల ప్రవీణ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జనసేన షణ్ముక వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు తెలియజేశారు. అప్పుల్లేనే ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమనన్నారు. సంపన్న ఆంధ్రప్రదేశ్ జనసేన ప్రధాన లక్ష్యమన్నారు. జీడీపీఎస్ లో మనం అగ్రస్ధానం సాధించినప్పుడే ఆంధ్రప్రదేశ్ సుసంపన్నంగా అవతరిస్తుందన్నారు. రాష్ట్రానికి మెరుగైన పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకురావడంతో పాటు ఫ్రెండీ ఇన్వెస్టిమెంట్ సిస్టమ్ ను అమలు చేస్తామని తెలిపారు.

See also  గడివలస గ్రామంలో పర్యటించిన జనసేన నాయకులు