ఉదయగిరి నియోజకవర్గం ఆత్మీయ పలకరింపు కార్యక్రమం

ఉదయగిరి

ఉదయగిరి ( జనస్వరం ) : జలదంకి లో నిమ్మలపల్లి రామ చైతన్య గారి ఇంట్లో జనసైనికుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో జనసేనపార్టీని ఈ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, టీడీపీ పార్టీతో ఎలా సమన్వయం చేసుకోవాలి అనే అంశాలతో చర్చించారు. జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలో చర్చించారు. ఈ కార్యక్రమంలో కమతం శ్రీనివాసులు, కలిగిరి మండలం నాయకులు బండారు లక్ష్మి నారాయణ, పొన్నం నాగేశ్వరరావు, కోసూరి సురేష్, దుత్తలూరు మండలం అధ్యక్షులు రవి కుమార్, వరికుంటపాడు మండలం అధ్యక్షులు రసూల్ పఠాన్, జలదంకి మండలం అధ్యక్షులు తోట మురళి, ఉపాధ్యక్షులు మల్లికార్జున, మండల కమిటీ సభ్యులు పాలంకి వేణు, పాలంకి మాలకొండయ్య, పోలిశెట్టి కాంతారావు, నాగిశెట్టి మహీధర్, నాగిశెట్టి మనోహర్, నాగిశెట్టి మహేష్, తోట చందు,నాగిశెట్టి మాల్యాద్రి, ఉదయగిరి అరవింద్, రాసంశెట్టి లోకేష్, తోట మణి, పాలంకి రామ్ & లక్ష్మణ్, కొల్లి రామ రావు అధితురులు పాల్గొన్నారు. 

See also   36 రోజు ఇంటింటికి జనసేన కార్యక్రమం