గొర్రెలు మరణించిన రైతు కుటుంబానికి అండగా నిలిచిన జనసైనికులు

గొర్రెలు

         విశాఖపట్నం ( జనస్వరం ) : మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం అలమండ పంచాయతీ అప్పన్నదొర వలస గ్రామంలో గత పది రోజుల కిందట పట్లాసింగి పండయ్యా అనే రైతు 12 గొర్రెలు వేటకుక్కల దాడిలో మరణించడం జరిగింది. ఆ కుటుంబాన్ని జనసేన నాయకులు నేరడ బిల్లి వంశీ, వాన ఉపేంద్ర, గార గౌరీశంకర్ ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులుఅనంత్, రాజేష్, రజింత్, సంజు, శివాజీ, చిరంజీవి, రాంబాబు, గణేష్, భార్గవ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు. 

See also  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం పవన్ కళ్యాణ్ కే సాధ్యం