కళ్యాణదుర్గంలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహణ

కళ్యాణదుర్గం, డిసెంబర్ 21, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు, కూటమి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సూచనలతో కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్, జనసేన జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య హాజరై 0–5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ రెండు చుక్కలతోనే పిల్లలకు జీవితకాల రక్షణ లభిస్తుందని తెలిపారు. పోలియో రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, తల్లిదండ్రులు ప్రభుత్వ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం జనసేన ఇంచార్జ్ బాల్యం రాజేష్, పట్టణ జనసేన నాయకుడు గంగరాజు, ఆసుపత్రి వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

See also  నేమకల్లులో అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం వినతిపత్రం