జగ్గయ్యపేటలో కార్యాలయాల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించట్లేదని తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు జనసైనికుల వినతి

జగ్గయ్యపేటలో కార్యాలయాల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించట్లేదని తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు జనసైనికుల వినతి

               జగ్గయ్యపేట నియోజకవర్గంలో పట్టణంలో పలు బ్యాంకుల వద్ద వై ఎస్ ర్ పథకం కోసం బ్యాంకుల వద్ద, ప్రభుత్వ కార్యాలయాల వద్ద  పట్టణ ప్రజలు బారులుతీరారని, కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులు వేచి ఉన్నారని, సంబంధిత అధికారులు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ జనసేన నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ తరుపున స్థానిక రెవిన్యూ వారిని కోరి, వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు అలా బ్యాంకులవద్ద, ప్రభుత్వ కార్యాలయాల  ముందు నిలుచున్న కూడా అధికారులు మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుందడా  ఉన్నారని ఆయన తెలిపారు. దీనితో పట్టణ ప్రజలు పెరుగుతున్న కరోనా  దృష్ట్యా అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆయన తెలిపారు.  తక్షణమే సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరుపున కోరుచున్నామని ఆయన తెలిపారు. ఇన్ని సమస్యలకు ఎదురై ఇబ్బందులు పడుతూ ప్రజలు కార్యాలయాల ముందు పడిగాపులు పడుతున్నప్పటికి  అధికారులు  ప్రజల్ని ఇబ్బందులు పెడుతన్నారు అని అన్నారు.  ఈ కార్యక్రమంలో త్రిశాంత్, నాగ, తరుణ్ తదితరులు  పాల్గొన్నారు.

See also  కదిరిలో ఘనంగా జనసేన నాయకులు భవానీ రవికుమార్ జన్మదిన వేడుకలు