ఇసుక రీచ్ లు ఏర్పాటు చేసి, ఇసుక కొరత తీర్చకపోతే నిరాహార దీక్ష చేస్తామన్న ఇచ్చాపురం జనసైనికులు

ఇసుక రీచ్ లు ఏర్పాటు చేసి, ఇసుక కొరత తీర్చకపోతే నిరాహార దీక్ష చేస్తామన్న ఇచ్చాపురం జనసైనికులు

                శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం నియోజకవర్గ౦లో ఇసుక అందుబాటులో లేకపోవటంతో భవన నిర్మాణ కార్మికులు చాలా కష్టాలు పడుతున్నారు. వారిని కష్టాలు నుండి గట్టు ఎక్కించాలి అంటే ఇసుక అందుబాటులోకి తేవాలి. ఈ ఇసుక కొరతతో మరెందరో కార్మికులు ఉపాధి కోల్పోయి పూట గడవడం కష్టంగా మారింది. ఇలా కార్మికులు కష్టాలు బారినపడకుండా ఇసుక రీచ్ లను ఏర్పాటు చెయ్యాలి అని పలుమార్లు దాసరిరాజు గారు ఇచ్చాపురం తహసీల్దార్ గారికి వినతిపత్రం అందించి కోరుకోవటం జరిగింది. కానీ అధికారులలో ఎటువంటి స్పందన కనబడకపోవడంతో ఇచ్చాపురం MPDO గారికి వినతిపత్రాన్ని అందించి సమస్యను పరిష్కరించాలని ఇచ్చాపురం జన సేన పార్టీ సమన్వయకర్త దాసరిరాజు గారు కోరడం జరిగింది. రానున్న మూడు రోజుల్లో ఇసుక రీచ్ లు ఏర్పాటు చేసి ఇసుక కొరత తీర్చకపోతే ఆగస్ట్15వ తేదీన ఇచ్చాపురంలో జనసేన పార్టీ తరుపున నిరాహారదీక్ష చేపడతామని దాసరిరాజు గారు స్పష్టం చేశారు. ఉదయం తొమ్మిది గంటలు నుండి సాయంత్రం 5 గంటలు వరకు నిరాహారదీక్ష చేపడతామని దాసరిరాజు గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తిప్పనదుర్యోధన రెడ్డి, సంతోష్ మహరణ, ఢిల్లీ బిసాయి, భాస్కర్ రావు, దాసరి శేఖర్, అఖిరా, సాయి తులసి దాస్, మణి, రవి తదితరులు పాల్గొన్నారు.

See also  డిగ్రీ కాలేజ్, ఐటిఐ భవన్ నిర్మాణం ఎంతవరకు వచ్చింది?