వైసీపీ నాయకుల దాడిలో గాయపడ్డ జనసైనికుడిని పరామర్శించి, ఆర్థిక సాయం చేసిన తణుకు జనసేన నాయకులు

తణుకు

    తణుకు, (జనస్వరం) : తణుకు పట్టణం 7వ వార్డు ఇందిరమ్మ కాలనీలో వైసీపీ నాయకుల దాడిలో పిల్లాడి పూర్ణ రామారావు తీవ్రంగా గాయపడడంజరిగింది. ఈ విషయం తెలుసుకున్న తణుకు నియోజకవర్గం జనసేన నాయకులు అనుకుల రమేష్, పిల్లాడి పూర్ణ రామారావు  కుటుంబాన్ని పరామర్శించి జనసేన పార్టీ తరపున భరోసా ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా అనుకుల రమేష్ మాట్లాడుతూ తణుకు నియోజకవర్గం లో ఏ జనసైనికుడికి ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా జనసేన శ్రేణులు అందరూ కలసి 47500రూపాయలు భాదిత జనసేన కార్యకర్త పిల్లాడి రామారావు వైద్య నిమిత్తం అనుకుల రమేష్ భాదిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కానూరి మాధవ రాయుడు, ముత్యాల శివ రామకృష్ణ, అడబాల మణికంఠ, ఆవాల సాయి, భూపతిరాజు విజయకుమార్ రాజు, తామరపల్లి సాయి, నెయ్యల శివ తదితరులు పాల్గొన్నారు.

See also  అనంతపురం జిల్లా జనసేనపార్టీ నాయకులు ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు