బాసురు గ్రామ జనసైనికులతో ఆత్మీయ సమావేశం

బాసురు

          శ్రీకాకుళం ( జనస్వరం ) : పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భన సత్తిబాబు గారు ఆధ్వర్యంలో బాసురు గ్రామ జనసైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పంట నష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ గారు లక్ష రూపాయల చొప్పున 3000 మంది కౌలు రైతులకు 30 కోట్లు సహాయం ప్రకటించడం జరిగింది. మొదటి రెండు మూడు విడతలు భాగంగా అనంతపురం, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాలో చనిపోయిన కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న ఆర్ధిక సహాయాన్ని గ్రామాల్లోని ప్రజలకు చేరువయ్యేలా జనసైనికులు బాధ్యత తీసుకోవాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.

See also  ఇసుక రీచ్ లు ఏర్పాటు చేసి, ఇసుక కొరత తీర్చకపోతే నిరాహార దీక్ష చేస్తామన్న ఇచ్చాపురం జనసైనికులు