ఆముదాలవలసలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

ఆముదాలవలసలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

              ఆముదాలవలస నియోజకవర్గం బోరగవలస గ్రామంలో జనసేన పార్టీ బలోపితం కోసం జనసేన కార్యకర్తలు అందరూ చర్చించండం జరిగింది. పార్టీని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి మరియు స్థానిక ఎన్నికలకు ఎలా గెలవాలి అని కొత్తకోట. నాగేంద్ర గారు, కన్నబాబు గారు, మల్లేష్ గారు మరియు బోరగవలస కార్యకర్తలు స్పష్టంగా వివరించారు. గ్రౌండ్ లెవల్ లో మనం కష్టపడి ప్రజలకి చెడు ఎదో మంచి ఎదో వివరిద్దాం అంతేకాని ఇంట్లో కూర్చుంటే మనం ఎప్పుడికి గెలవలేము అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మరియు మన సిద్దాంతాలు నచ్చి జనసేనాని ఆశయం కోసం పని చేయడానికి కొంతమంది స్వతంత్రగా ఉన్నవాళ్లు జనసేన పార్టీ లో చేరడానికి వచ్చిన వారికి స్వాగతం తెలిపారు. 

See also  జనసేన పార్టీకి ఒక అవకాశం ఇస్తామంటున్నా 12వ డివిజన్ ప్రజానీకం