మదనపల్లి నియోజకవర్గములో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

     మదనపల్లి, (జనస్వరం) :  చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గం జనసేనపార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు రామాంజనేయులు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, పట్టణ అధ్యక్షులు నాయిని జగదీష్ బాబు ఆధ్వర్యములో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లి అధికారంలోకి రాకుండా, దొంగ ఓట్లు పోల్ అవకుండా ఉమ్మడి అభ్యర్థి గెలుపునకు ఎలా పని చేయాలి, పలు రకాల అంశాలుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు కోటకొండ చంద్రశేఖర్, కుప్పాల శంకర, అశ్వత్ ,ధరణి,యాసిన్, గణేష్, సోను,హర్ష, అశోక్, కిరణ్ కుమార్ రెడ్డి, శ్రీనాథ్,గురు, గంగాధర్, శ్రీనివాసులు, సిద్దయ్య, రమేష్ మహిళా నాయకులు శ్రీమతి మల్లికా, రూప బిసి అధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

See also  పవనన్న ప్రజాబాటలో ఇంటింటికో బాధ చెప్తున్నారు : కేతంరెడ్డి వినోద్ రెడ్డి