ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు బస్సు సౌకర్యం కొరకు RTC డిపో మేనేజర్ గారికి వినతిపత్రం ఇచ్చిన శింగనమల జనసేన నాయకులు

     శింగనమల, (జనస్వరం) :  శింగనమల మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు విధ్యార్థులు కాలినడకన ఆటోలలో నాగులగుడ్డం తాండ, నాగులగుడ్డం, వెస్ట్ నరసాపురం, గురుగుంట్ల, చిన్నజలాలపురం గ్రామాల నుండి వస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారే విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు అనంతపురం RTC డిపో అసిస్టెంట్ మేనేజర్ గారికి జనసేన పార్టీ తరుపున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఒక వారంలో బస్సు ను ఏర్పాటు చేసి విధ్యార్థులకు ఇబ్బంది లేకుండా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శింగనమల నియోజకవర్గ నాయకులు సాకే మురళి క్రిష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, రాజు, ఓబిలేస్, గజేంద్రనాయక్, రామంజి నాయక్, మధు తదితరులు పాల్గొన్నారు.

See also  బొబ్బిలి పూలబాగు రోడ్డు బాగు చేయాలని జనసేన నాయకుల డిమాండ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి