భవన నిర్మాణ కార్మికులకు ఇసుక వెంటనే అందుబాటులోకి తీసుకురావాలి : జనసేన నాయకులు మైలేరి మల్లయ్య

భవన నిర్మాణ కార్మికులకు ఇసుక వెంటనే అందుబాటులోకి తీసుకురావాలి : జనసేన నాయకులు మైలేరి మల్లయ్య

                  ఆళ్ళగడ్డ నియోజకవర్గం జనసేన నాయకులు మైలేరి మల్లయ్య మాట్లాడుతూ ఇదే రోజున సంవత్సరం క్రితం భవన కార్మికులకు మద్దతుగ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారని, ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు అప్పులు చేసి తమ భార్యా పిల్లలను పోషించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో భవన మరియు ఇతర నిర్మాణాల పైన ఆధారపడి దాదాపు 15 వేల వరకు కార్మికులు జీవనం కొనసాగిస్తున్నారు భవన నిర్మాణ కార్మికులు పనులకు వెళ్లాలంటే ఇసుక అవసరం ఇసుక కావాలని ఆన్లైన్ దగ్గరకు వారాల కొద్దీ తిరిగిన ఇసుక ఆన్లైన్ కావడం లేదు అధికారులను అడిగితే ఇసుక స్టాక్ లేదు అని ఇసుక నీటిలో మునిగిందని ఆన్లైన్ పనిచేయడం లేదని అనేక కుంటిసాకులతో కార్మికులను ఇబ్బందికి గురి చేస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక 7500/ లభించేది రెండు నెలల నుండి ఇసుకనే దొరకటం లేదు యిదే అదునుతో దళారులు ట్రాక్టర్ ఇసుక 12,000/ బ్లాక్ లో అమ్ముతున్నారు. సామాన్యుడు బ్లాక్ లో ఇసుక కొనలేక ఇల్లు కట్టుకోలేక మధ్యలోనే ఆపేసారు. రాష్ట్ర ప్రభుత్వము వెంటనే భవన నిర్మాణ కార్మికులను దృష్టిలో ఉంచుకొని ఇసుక ఇసుక స్టాక్ నిలువ వుంచి ఒక్కరోజులోనే ఇసుక ఆన్లైన్ బుక్ అయి కార్మికులకు మరుసటి రోజే అందుబాటులోకి రావాలి అని అన్నారు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ సమస్య పై దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆంజనేయులు, నరేంద్రయాదవ్, వెంకటసుబ్బయ్య, మహబూబ్ బాష తదితరులు పాల్గొన్నారు. 

See also  అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక, వస్తు సహాయాన్ని అందించిన కావలి జనసేన నాయకులు అళహరి సుధాకర్