జనసైనికుడి గృహ నిర్మాణానికి 50 సిమెంట్ బస్తాలు సహాయం చేసిన సఖినేటిపల్లి చిరు పవన్ సేవా సమితి

సఖినేటిపల్లి

        సఖినేటిపల్లి మండలం మోరిపోడు గ్రామానికి చెందిన రుద్ర రమేష్ ఇల్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయి, సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న కార్యకర్తకు అండగా నిలబడి మనోదైర్యం నింపి అతను కొత్త గృహ నిర్మాణానికి అవసరమయ్యే సిమెంట్ను సఖినేటిపల్లి చిరు పవన్ సేవా సమితి సభ్యులు నామన నాగభూషణం గారి ఆధ్వర్యంలో సేవా సమితి సభ్యులు సహకారంతో 50 సిమెంటు బస్తాలను ఆ గ్రామ పెద్దలు, జనసేన నాయకులు, జనసైనికులు ఆధ్వర్యంలో రమేష్కు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుండుబోగుల పేద్దకాపు, దిరిశాల బాలాజీ, గుండాబత్తుల తాతాజీ, పినిశెట్టి బుజ్జి, బోనం సాయి, తాడి మోహన్ , రావురి నాగు, బళ్ళ రాము, ముప్పర్తి సుబ్బారావు, తాడి సత్య , నామన నాగభూషణం, ఉండపల్లి అంజి, బళ్ళ శ్రీను, కూనా నాగేశ్వరావు, నరహరిశెట్టి శ్రీను, చల్లా గణీ, నామన సుర్యనారాయణ, బన్ను, కోనపల్లి సురేష్, అడబాల మధు, బళ్ళ సురేష్, అడ్డాల శివనాయుడు, పోలిశెట్టి గణేష్, బోనం చంటినాయుడు, ముత్యాల జగదీష్, జగడాల సాయి, మెగాఅభిమానులు మరియు  జనసేన నాయకులు, జనసైనికులు  తదితురులు పాల్గొన్నారు.

See also  జనసేన - టిడిపి సమన్వయంతో పనిచేసి ప్రజల మెప్పు పొందాలి :  కోన తాతారావు