జనసైనికుడి కుటుంబానికి రూ.1,00,000 సహాయం అందించిన అనంతపురం జనసేన జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య

అనంతపురం

              అనంతపురం ( జనస్వరం ) : పుట్టపర్తి నియోజకవర్గంలోని ఎనుముల పల్లి గ్రామానికి చెందిన జనసైనికుడు దేవరకొండ హరీష్ అకాల మృతి చెందారు. వారి కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్ పాల్గొన్నారు. అకాల మృతి చెందిన జనసైనికుడు దేవరకొండ హరీష్ గారి కుటుంబానికి చేయూతగా టి.సి వరుణ్, చిలకం మధుసూధన్ రెడ్డి సమక్షంలో అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య 100000/- లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అంకె ఈశ్వరయ్య మాట్లాడుతూ హరీష్ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మరియు నాయకులు పాల్గొనడం జరిగింది.

See also  విజయవాడ 51వ డివిజన్ లో ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు