రైతులకు తక్షణమే రూ.10వేల సహాయం అందించాలి : దెందులూరు జనసేన నాయకులు

రైతులకు తక్షణమే రూ.10వేల సహాయం అందించాలి : జనసేన నాయకులు పల్నాటి సాగర్

             నివార్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు దెందులూరు నియోజకవర్గం పెదపాడులో నిరసన దీక్ష ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మన దెందులూరు జనసేన నాయకులు శ్రీ కోటగిరి వెంకట సుధాకర్ గారు, శ్రీ పల్నాటి సాగర్ గారు, విలేజ్ కోఆర్డినేటర్స్ మరియు జనసైనికులు దీక్ష చేయడం జరిగింది. ఈ నిరసన దీక్షకు బిజెపి మండల అధ్యక్షులు శ్రీ కడగంచి శ్రీనివాసరావు గారు, మాజీ ఎం. పి. పి. శ్రీ నిమ్మకూరి కిరణ్ కుమార్ గారు, పెదపాడు మండల బిజెపి ఉపాధ్యక్షులు శ్రీ రమేష్ మనికొండ గారు మరియు హనుమాన్ జంక్షన్ జనసైనికులు వచ్చి సంఘీభావం తెలిపారు.

See also  నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 150 రోజుకి చేరుకున్న పవనన్న ప్రజాబాట