గ్రామీణ ప్రాంతాల రహదారులకు మరమ్మతులను చేపట్టాలి : రాహుల్ సాగర్

రాహుల్ సాగర్

                 ఎమ్మిగనూరు ( జనస్వరం ) : గ్రామీణ ప్రాంతాల రహదారుకు మరమ్మతులను చేపట్టాలని డిమాండ్ చేసిన జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్ సాగర్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు మండల పరిధిలో ఉన్న గ్రామాల రహదారులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని అధికారులు స్పందించి వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని అన్నారు. మండలంలో ఉండే అనేక గ్రామాల్లో రహదారులు గుంతల మయంగా మారాయని ఇలా మారడం వల్ల రహదారులో ప్రయాణించే వాహనదారులు గ్రామవాసులు తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నారని జాతీయ రహదారులకు ఆనుకొని ఉన్న గ్రామాల దగ్గర ఈ సమస్య తీవ్రంగా ఉందని ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి త్వరలోనే రహదారుల మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

See also  88వార్డ్ సత్తివానిపాలెం గ్రామంలో డ్రైనేజీ, రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన