
రాజంపేట, (జనస్వరం) : కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం పరిధిలోని వీరబల్లి మండలం, గడికోట పంచాయతీకి చెందిన బ్రిడ్జి నిర్మాణం లేకపోవడం వలన దాదాపు 12 గ్రామాలు, 2000 కుటుంబాలు బ్రిడ్జి నిర్మాణం లేక అష్టకష్టాలు పడుతున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం గడికోట ప్రజల తరుపున పోరాటం చేయటానికా వచ్చిన ఏకైక పార్టీ జనసేన అని అన్నారు. గడికోట బ్రిడ్జి కోసం కడప జిల్లా కలెక్టరెట్ వద్ద హరిరాయల్ ఆధ్వర్యంలో జనసేనపార్టీ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామ శ్రీనివాసులు, రాజంపేట నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామాల ప్రజలు ఈ ధర్నా లో పాల్గొన్నారు.









