ఛత్తీస్‌ ఘడ్ లో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ పెట్టుకున్న ఆశలు

  ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ప్రెస్మీట్లో మాట్లాడుతూ మిగతా రాష్ట్రాల ఎన్నికల గురించి మాట్లాడడం చర్చనీయాంశం అయింది. కథనంలోకి వెళితే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి మంచి అవకాశాలు ఉన్నాయని, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లను కచ్చితంగా గెలుస్తామని, తెలంగాణలోను గెలవొచ్చునని మరియు రాజస్థాన్‌లో కూడా విజయం సాధిస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ విషయంలో గెలుపు సాధించడం అంత చిన్న విషయం కాదని సొంత పార్టీ కార్యకర్తల నుండి వినికిడి. రాష్ట్ర స్థాయి నాయకులలో జరుగుతున్న అధికార పోరు కూడా ఒక కారణం అని విశ్లేషకుల అంచనా. 

See also  సచివాలయంలో జగనన్న ఇళ్ళు గురించి వివరాలు అడిగి తీసుకున్న వజ్రకరూరు జనసేన నాయకులు