
కడప ( జనస్వరం ) : పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కొత్తచెరువులో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్రైల్వే కోడూరు జనసేన నాయకులు మర్రిరెడ్డి ప్రసాద్ పత్రికా ముఖంగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ మమ్మల్ని ఎత్తిచూపడానికి మీరు ప్రతిపక్షంలో లేరు అధికార పక్షంలో ఉన్నారు. అది గుర్తుంచుకోండి. అలాగే కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన బాకీలు చెల్లిస్తే వారు ముందుకు వచ్చి వీటిని మరమ్మతులు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారన్న ఒక ప్రెస్ నోట్ తోనే భయపడి నాయకులు కాంట్రాక్టర్లతో సమీక్షలు పెట్టి రేయింబవళ్ళు కష్ట పెట్టించి రోడ్లు వేయించారు. ఇదే సంగతి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ మీకు నెల రోజులు గడువు ఇచ్చారు. అప్పుడు గుర్తుకు రాలేదా నియోజకవర్గంలో మరెన్నో రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి. దాని గురించి మీకు పట్టదా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మేము గుంతల పడ్డ రోడ్లు చూపిస్తానన్నారు. మా నాయకుడు పవన్ కల్యాణ్ గారికి కూలి ఇవ్వడం కాదు. మీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకుంటే చెప్పండి రాష్ట్రంలోని జనసేన పార్టీ క్యాడర్ అంతా చందాలు వేసుకొని రోడ్లు వేసి అందరికీ కూలీలు మేమే ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యే గారు మాటలు హద్దుల్లో పెట్టుకొని మాట్లాడాలని వాస్తవాలను గ్రహించాలని హితవు చేస్తూ పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్న రోడ్లు దారుణంగా దెబ్బతిన్న విషయం నిజం కాదా ?రోడ్లలో గుంతలు బావులుగా ఉన్న విషయం నిజం కాదా ? బహిరంగంగా చెప్పాలని రాష్ట్రంలోని మొత్తం రోడ్లు దారుణంగా ఉన్న విషయం వాస్తవం కాదా? అని జనసేన పార్టీ తరపున అడుగుతున్నామన్నారు.








