అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన కుటుంబానికి అండగా నిలిచిన పెనమలూరు నియోజకవర్గ జనసేన నాయకులు

   పెనమలూరు, (జనస్వరం) : కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఆ గ్రామములో ఉన్నటువంటి జనసైనికుడు గంధం అనిల్ నియోజకవర్గ జనసేన నాయకులకు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పెనమలూరు నియోజకవర్గ నాయకులు పులి కామేశ్వరరావు ఆ కుటుంబాన్ని పరామర్శించటం జరిగింది. ఆ కుటుంబానికి నిత్యావసర సరుకులు, గ్యాస్, సిలిండర్ అందించడం జరిగింది. ఆలాగే జనసేన పార్టీ పేదలకు ఎప్పుడు అండగా ఉంటుంది అని భోరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోన జనార్దన్ కంకిపాడు మండల అధ్యక్షులు ముప్పా రాజా, బోయిన నాగరాజు, ముప్పిరి ఆర్.కె.నాయుడు, సుంకర శివ, వీర మహిళలు కొఠారి లావణ్య, సునీత తదితరులు పాల్గొన్నారు.

See also  మృతి చెందిన జనసేన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన పిఠాపురం జనసేనపార్టీ ఇంఛార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి