మలిశెట్టి ఆధ్వర్యంలో 133 వ రోజు కొనసాగుతున్న పవన్ అన్న ప్రజా బాట

  రాజంపేట ( జనస్వరం ) : సుండుపల్లి మండలం రాయవరం పంచాయతీలో పలు గ్రామాలలో కావలి పల్లి, సీనేపల్లి, బొంగొలపల్లి,జంగంపల్లి, రచపల్లి, కుడుంవా oడ్ల పల్లిలో 133 వ రోజు పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమాన్ని రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ గారు ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ, వాటిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని ప్రజలు జనసేన తెలుగుదేశం పార్టీకి ప్రజలు నీరాజనాలు అర్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు జగన్ రెడ్డి పరిపాలన విసుగెత్తి ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపిపార్టీ మద్దతుదారున్ని ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, చౌడయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు, జనసేన వీర మహిళలు సుగుణమ్మ, లక్ష్మమ్మ, పోలిశెట్టి రజిత, శిరీష, మాధవి, తదితరులు పాల్గొన్నారు.

See also  ఫ్యూచర్ నెట్వర్క్స్ సీఈవో దుర్గాప్రసాద్ విరాళం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి