పవనన్న షణ్ముఖ వ్యూహం రాష్ట్రాభివృద్ధికి చిహ్నం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

షణ్ముఖ వ్యూహం

       నెల్లూరు ( జనస్వరం ) : సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 135వ రోజున 50వ డివిజన్ సంతపేటలోని శ్రీనివాసపురం ప్రాంతంలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యలను అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారి అడుగులు పడ్డాయని, రాష్ట్ర ప్రజలందరూ పవనన్న ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారని, తమ ఆశీస్సులు అందిస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు రూపొందించిన షణ్ముఖ వ్యూహం రాష్ట్రాభివృద్ధికి చిహ్నంగా మారనుందని, పవనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి మంచి రోజులు రానున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  ఆలూరు నియోజకవర్గములో గడప గడపకు జనసేన పార్టీ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి