
కర్నూలు, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి 50వ జన్మదిన వేడుకలు కర్నూలులో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఘనంగా జరిపారు. ఇందులో భాగంగా జనసేన పార్టీ సింగపూర్ ఆధ్వర్యంలో కర్నూలు జాయ్ చిల్డ్రన్ అనాధ ఆశ్రమంలో అనాధ పిల్లల మధ్య కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కర్నూలు, పాణ్యం నియోజకవర్గ బాధ్యులు చింతా సురేష్ బాబు, జనసేన నాయకులు చైతన్య, మౌలాలి, అభిషేక్, మహేష్ మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.









