ఖమ్మం లో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఖమ్మంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

          తెలుగు సినివినీలాకాశంలో చిరు తమ్ముడిగా వచ్చి అనతికాలంలోనే లక్షలాది అభిమానుల గుండెల్లో పవర్ స్టార్ గా అనూహ్యమైన స్థానం సంపాదించుకొని, ఇరురాష్ట్రాల తెలుగు ప్రజల కోసం జనసేన పార్టీ స్థాపించిన జనహృదయ నేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఖమ్మం లో జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ సేవ సమితి నాయకులు, చిరంజీవి గారి అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా నాయకులు పవన్ కళ్యాణ్ సేవ సమితి జిల్లా గౌరవ అధ్యక్షులు చిరంజీవి గారి సీనియర్ అభిమాని Md. సాధిక్ అలీ, పవన్ కళ్యాణ్ సేవ సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శుల గడ్డం మహేష్ , సూరజ్ కిరణ్, తదితరుల ఆధ్వర్యంలో వృధాశ్రమంలో అన్నదానం, మరియు జన్మదిన కేక్ కట్ చేసినారు. ఈ సందర్బంగా జనసేన జిల్లా నాయకులు Md. సాధిక్ అలీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా అభిమానులు ఘనంగా జరుపుకున్నారని, వృద్ధాశ్రమాల్లో అన్నదానం చేయడం సంతోషంగా ఉందని అదేవిధంగా ప్రతి పుట్టినరోజున అభిమానులతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసేవారమని కరోనా మహమ్మారి వల్ల ఈ సారి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయలేదని తెలిపారు. జన్మదినవేడుకల్లో భాగంగా చిత్తూరు జిల్లాలో ఫ్లెక్సీ కడుతూ చనిపోయిన మరియు వరంగల్ నుండి పరకాల్ వెళుతూ యాక్సిడెంట్ కు గురై చనిపోయిన అభిమానులకు సంతాపం ప్రకటించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన కార్యకర్తలు ఎన్ని అవాంతరాలు ఎదురైన జనసైనికులుగా పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మిరియాల జగన్, సూరజ్ కిరణ్, బండారు రామకృష్ణ,గౌరిశెట్టి వినోద్, శ్రీను, లక్ష్మణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

 

See also  ఆడబిడ్డల మానప్రాణాలకు లెక్క కడుతున్న వైసీపీ నాయకులు