నేడు మంత్రి నారా లోకేష్ పర్యటన విజయవంతం చేయలి ప్రజా దర్బార్ లో పప్పల చలపతిరావు

యలమంచిలి, ఫిబ్రవరి 27 (జనస్వరం) : పట్టణంలో టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ ప్రజా దర్బార్ లో మాజీ పార్లమెంట్ సభ్యులు పప్పల చలపతిరావు ఆర్జీలను స్వీకరించారు. అనంతరం పప్పల చలపతిరావు మాట్లాడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ 28న నియోజకవర్గంలో రాంబిల్లి మండలంలో బ్లూజెట్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేయుచున్నారని, నారా లోకేష్ పర్యటనను టీడీపీ కుటుంబ సభ్యులందరూ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గొర్లి శివన్నారాయణ మూర్తి, మండల అధ్యక్షులు ఇత్తంశెట్టి సన్యాసి నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి దాడి రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గెంజి శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొర్లి బాబురావు, మజ్జి రామకృష్ణ, కరణం రవి కుమార్, గుప్తా తదితరులు పాల్గొన్నారు.

See also  క్రీడాస్ఫూర్తితో రాణించాలి : విద్యావేత్త గొర్తి వెంకట్ పిలుపు