
నందిగామ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ సింగరాజు సాయికృష్ణ.
సత్తెనపల్లి.డిసెంబర్10.(జనస్వరం)
రూరల్ మండలం నందిగామ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్బంగా నందిగామ ప్రీమియర్ లీగ్(NPL) క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న సాయికృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సింగరాజు సాయికృష్ణ.ఈ సందర్బంగా డాక్టర్ సింగరాజు సాయికృష్ణ మాట్లాడుతూ నందిగామ గ్రామంలో సంక్రాంతి సందర్బంగా జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొంటున్న క్రీడాకారులకు ముందుగా అభినందలు తెలిపారు. అందరు కూడా స్నేహపూర్వక వాతావరణంలో పాల్గొని గెలువు ఓటములకు అతీతంగా క్రీడాస్ఫూర్తితో మెలగాలని కోరారు.ముందుగా ఆయన స్థానిక గ్రామ పెద్దలు రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆళ్ళ అమరేశ్వర రావు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చయ్య తో కలిసి టోర్నమెంట్ ని ప్రారంభించి ఇరు జట్లు కు శుభాకాంక్షలు తెలిపి టీ -షర్ట్స్ పంపిణి చేసారు.

ఈ కార్యక్రమంలో శొంఠినేని మార్కండేయులు, టోర్నమెంట్ నిర్వాహకులు గోపాల్,శివ ప్రసాద్, మణికంఠ మరియు క్రీడాకారులు నందిగామ గ్రామ ప్రజలు పాల్గొన్నారు








