ఎచ్చర్లలో జనసేన నాయకులఆధ్వర్యంలో నేతాజీ గ్రంథ రచయిత MVR శాస్త్రి గారి ఆత్మీయ సభ ఏర్పాటు

నేతాజీ

           ఎచ్ఛర్ల ( జనస్వరం ) : ఎచ్చెర్ల నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయం దగ్గర నేతాజీ గ్రంథ రచయిత MVR శాస్త్రి గారి ఆత్మీయ సభ ఏర్పాటు చేయడం జరిగింది. నేతాజీ గ్రంథ రచయిత ఇచ్చిన అద్భుతమైన సందేశంలో దేశానికి స్వాతంత్య్రం నేతాజీ సాయుధ పోరాటం వల్లే వచ్చిందని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  గారి #BringbackNetajiAshes #RenkojiToRedfort అన్న పిలుపు ఆతనిలో ఉన్న దేశ భక్తిని తెలుపుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ సభకి ముఖ్య అతిధిగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిసెట్టి సత్య హాజరయ్యారు. అలాగే ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు, ఎచ్చెర్ల జనసేన నాయకులు భూపతి అర్జున్ జన సైనికులు వందల సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమని విజయవంతం చేశారు.

See also  అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలి - గాదె వెంకటేశ్వరరావు